అయితే ఈయనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కప్పిపుచ్చుకున్నాడని ఈ వ్యక్తిపై ఎంతోమంది బాధితులు ఫిర్యాదులు చేసిన స్పందన లేకపోవడంతో నిరాశతో నలిగిపోతున్నారని స్థానికులు తెలుపుతున్నారు అలాగే ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ఈ వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ భూకబ్జా కేసులు నమోదు చేసి ఈ భూ బకాసురుడు నుండి మమ్మల్ని కాపాడాలని స్థానిక గ్రామ ప్రజలు దళితులు కోరుతున్నారు..
కాకినాడ జిల్లా, సామాజిక స్పందన:
జైభీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లిఖార్జున (న్యాయవాది) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కార్యాలయం నందు భారీగా యువత పార్టీలోకి చేరడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లిఖార్జున మాట్లాడుతూ జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పార్టీలోకి ప్రజలని ఆహ్వానిస్తున్నామన్నారు.
జైభీమ్ భారత్ పార్టీ అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధించిన పార్టీఅని, ప్రజానాయకుడు శ్రావణ్ కుమార్ గారు స్థాపించిన జైభీమ్ భారత్ పార్టీలోకి ప్రజలందరూ వచ్చి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.
జైభీమ్ భారత్ పార్టీ ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించింది కాదని కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలోకి బ్రాహ్మణలు, వైశ్యులు, కాపులు, పద్మశాలీలు, ఎస్సీ ఎస్టీ వారు అధిక సంఖ్యలో వచ్చారని, వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మందికి ముందుకు రావాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులుగా పేంకే వెంకటరమణ
జిల్లా కోశాధికారిగా గుగ్గిలపు హరీష్
జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా జగ్గారపు గణేష్ స్వామి
జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా గొట్టాల నరేంద్ర కుమార్
పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా చింతలపాటి సురేష్ పెద్దాపురం మండలం ఉపాధ్యక్షులుగా కొప్పర్తి సాయి కృష్ణ గార్లను నియమించడం జరిగింది.












0 Comments