ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి, నేటి నుండి భ‌వ‌న నిర్మాణ కార్మికుల జిల్లా మ‌హాస‌భ‌లు



సామాజిక స్పందన, పెద్దాపురం పట్టణం

భగత్ సింగ్ స్ఫూర్తితో పని చేయ్యాలి, విప్లవ కిశోరం భగత్ సింగ్ పోరాట స్పూర్తితో పని చేయ్యాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు పెద్దాపురం నువ్వులగుంటవీధి లో ఉన్న భగత్ సింగ్ విగ్రహం వద్ద 115వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా భగత్ సింగ్ విగ్రహానికి ప్రజానాట్యమండలి నాయకులు సిరిపురపు బంగార్రాజు, ప్రసాద్, ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ లు పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో అతి చిన్న వయస్సులో ప్రాణాలర్పించిన మహోన్నత యెాధుడు భగత్ సింగ్ అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పని చేస్తూనే దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలో ఆలోచనలే చేసారన్నారు. అందరికి తిండి బట్ట, ఉండడానికి ఇళ్ళు ఉండాలని కలలుగన్న మహా దార్శినికుడని అన్నారు. 12 ఏళ్ళవయస్సులోనే దేశస్వాతంత్రం కోసం ఆలోచించారని అన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న కులం మతం అంశంపై స్పష్టమైన అభిప్రాయాన్ని భగత్ సింగ్ కలిగి ఉండేవారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు మనందరం కలసి పని చేయాలని విజ్ఞాప్తి చేసారు. పరరజానాట్యమండలి నాయకులు రొంగల వీర్రాజు, డి.కృష్ణ, ఎమ్.రాంబాబు, డి.సత్యనారాయణ, సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, కూనిరెడ్డి అప్పన్న, నెక్కల నరసింహమూర్తి, మహిళా సంఘం నాయకులు రొంగల సుబ్బలక్ష్మీ, ఎస్.శ్రీనివాస్, గౌస్, అఖిల, నిఖిల తదితరులు పాల్గోన్నారు..

######### మరిన్ని వార్తలు చదవండి ########


నేటి నుండి భ‌వ‌న నిర్మాణ కార్మికుల జిల్లా మ‌హాస‌భ‌లు


సామాజిక స్పందన, పెద్దాపురం పట్టణం

పెద్దాపురం ప‌ట్ట‌ణంలో ఈ నెల 29,30, అక్టోబ‌ర్ 11వ తేదీన 3 రోజు పాటు కాకినాడ జిల్లా భ‌వ‌న నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మ‌హాస‌భ‌లు జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఎ.పి. బిల్డింగ్ అధ‌ర్ క‌న‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (సిఐటియు) జిల్లా అధ్య‌క్షులు గ‌డిగ‌ట్ల స‌త్తిబాబు పిలుపునిచ్చారు. మ‌హాస‌భ‌ల ఏర్పాట్ల స‌మిక్ష స‌మావేశం ప్రైవేట్ ఎల‌క్ట్రికల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ గౌర‌వాధ్య‌క్షులు చింత‌ల స‌త్య‌నారాయ‌ణ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స‌త్తిబాబు మాట్లాడుతూ జిల్లాలు విడిపోయిన త‌రువాత మొద‌టి సారి మ‌హాస‌భ‌లు నిర్వ‌హ‌ణ చేస్తున్నామ‌ని వీటిని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని అన్నారు. జిల్లాలో 21 మండ‌లాల నుండి గ్రామాల వారి ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని అన్నారు. 29 వ తేదీన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు జీవిత చ‌రిత్ర‌ను ప్ర‌తిబింబించే ఫోటో ఎగ్జిబిష‌న్ మెయిన్‌రోడ్ వినాయ‌కుని గుడి సెంట‌ర్‌లో జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ ఎగ్జిబిష‌న్‌ను సిఐటియు జిల్లా కార్య‌ద‌ర్శి చెక్క‌ల రాజ్ కుమార్ ప్రారంభిస్తార‌ని అన్నారు. 30 వ‌తేదీన క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌, అక్టొబ‌ర్ 1వ తేదీన ప్ర‌తినిధుల స‌భ యాస‌ల‌పు సూర్యారావు భ‌వ‌న్‌లో జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ మ‌హాస‌భ‌ల‌కు రాష్ట్ర నాయ‌కులు హాజ‌రువుత‌న్నార‌ని అన్నారు. 1వ తేదీ ఉద‌యం ప్ర‌తినిధుల స‌భ అయిన త‌రువాత పెద్దాపురం ప‌ట్ట‌ణంలో ర్యాలీ జ‌రుగుతుందిని తెలిపారు. ఈ స‌మావేశంలో శ్రీ మరిడ‌మ్మ త‌ల్లి పెయింటింగ్ యూనియ‌న్ నాయ‌కులు తైనాల శ్రీ‌ను, గూనూరి ర‌మ‌ణ‌, రాజ‌మంద్ర‌పు రామారావు, పాండ‌వ‌గిరి పెయింటింగ్ యూనియ‌న్ నాయ‌కులు నీలం శ్రీ‌ను, క‌ర‌ణం అప్పారావు, గ‌డ‌పా వీర‌బాబు, సిఐటియు నాయ‌కులు డి.క్రాంతి కుమార్ త‌దిత‌ర‌లు పాల్గోన్నారు...



Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.