సామాజిక స్పందన: కాకినాడ
వైసిపి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అతని కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసిన ఉదయ భాస్కర్ ను వెంటనే అరెస్టు చేయాలని అతను ఎమ్మెల్సీ ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ ,సిపిఎం ,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, జై భీమ్ బీఎస్పీ ,ఆర్ పి ఐ ,దళిత సంఘాలు ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జిజిహెచ్ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు .సుమారు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆందోళన నిర్వహించారు
గవర్నర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ ని రద్దు చేయాలి జై భీమ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.
అనంత బాబు ను అరెస్టు చేసే వరకు ఉద్యమ ఆగేది లేదు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ఆందోళన చేశారు.
అనంతరం మీడియాని ఉద్దేశించి జై భీమ్ రాష్ట్ర అధ్యక్షులు ,మాజీ న్యాయవాది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ హత్య చేసి 24 గంటలు గడుస్తున్న ఇప్పటికీ అనంత బాబు ను అరెస్టు చేయకపోవడం దారుణం అన్నారు ఈ హత్యను ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు వెంటనే పోలీసులు 302 గా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గవర్నర్ జోక్యం చేసుకుని అతను ఎమ్మెల్సీ ను సభ్యత్వం ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ చట్టాలు అధికార పార్టీ ఒకలా ,పేదవారికి ఒక ఒకలా ఉన్నాయని ఆయన తెలిపారు ఈ సంఘటన సామాన్యుడు చేస్తే పోలీసులు ఈ విధంగా స్పందిస్తారా అని పేర్కొన్నారు అనంత బాబు ధైర్యంగా కాకినాడ లోనే ఉండి పెళ్లిళ్లకు తిరుగుతున్న అతని నీ అరెస్టు చేసి సాహసం చేయకపోవడం దుర్మార్గమన్నారు సంఘటన జరిగి 24 గంటలు గడిచినా కనీసం హోంమంత్రి కూడా నోరు మెదపలేదు అని ఏ ఒక్క జిల్లాలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఆసుపత్రికి రాలేదని దీంతో దళితుల మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అందరికీ అర్థమైందని తెలిపారు
సిపిఎం జిల్లా కన్వీనర్ m.రాజశేఖర్ మాట్లాడుతూ అతని కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని ఈ కేసును నీరుగారుస్తున్న పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ అరెస్టు చేయాలని రాజశేఖర్ తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ ,సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ,ఆర్ పి ఐ రాష్ట్ర కార్యదర్శి పిట్ట వరప్రసాద్ ,బి ఎస్ పి దళిత సంఘాల నాయకుడు ఏనుగుల కృష్ణ, కొండబాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జి. లోవ రత్నం ,ఏ ఐ టి యు సి నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ వామపక్ష నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ ,ఆర్.నాగేశ్వర రావు చిట్టి బాబు శ్రీను తదితరులు నాయకత్వం వహించారు










0 Comments