అల్లర్ల మధ్య రాజ్ నాథ్ రెండో అత్యున్నత స్ధాయి సమీక్ష

 

 సామాజిక స్పందన: దిల్లీ
 అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ.. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ నుంచి ఉద్యోగార్థులు వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారమూ సైనిక ఉద్యోగార్థులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నేడు ఉదయం 10:30 గంటల సమయంలో అత్యున్నత స్థాయి సమీక్షకి పిలుపునిచ్చారు.ఇలా 24 గంటల వ్యవధిలో రెండోసారి ఆయన సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ, హోంశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న సమీక్ష నిర్వహించిన అనంతరం సైన్యంలో చేరి నాలుగేళ్లు పూర్తిచేసుకున్న 'అగ్నివీర్‌'లకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో, అస్సాం రైఫిల్స్‌లో 10% పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమోదం తెలిపారు. తీరగస్తీ దళంలో, రక్షణ రంగ సివిలియన్‌ పోస్టుల్లో, ఈ రంగానికి చెందిన 16 ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా 10% రిజర్వేషన్‌ వర్తిస్తుందని ఆయన కార్యాలయం తెలిపింది. మాజీ సైనికుల కోటాకు ఇది అదనమని, నియామక నిబంధనల్లో ఈ మేరకు సవరణలు చేయనున్నామని ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో నేటి సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనన్న చర్చ ప్రారంభమైంది.అగ్నిపథ్‌ అమలు విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, అల్లర్లను చల్లార్చేందుకు మరిన్ని ఉపశమనాలు ప్రకటించొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే త్రివిధ దళాలు త్వరలో నియామక ప్రక్రియ చేపడతామని ప్రకటించాయి. మరోవైపు వాయుసేన ఏకంగా నేడు నియామక ప్రక్రియ వివరాలనూ వెల్లడించింది.మరోవైపు ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు కూడా రైల్వేశాఖ పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్నింటి సమయాన్ని మారుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు నేడు జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..

@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@


వరుడు లేని పెళ్లి , ముహూర్తానికి ముందే క్షమా 'స్వీయ వివాహం' ఇదేం ముచ్చట ?

సామాజిక స్పందన: ప్రత్యేక కథనం

ఆత్మీయుల సమక్షంలో బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు 'స్వీయ వివాహం' చేసుకొంది.సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్నీ ఉన్నాయి గానీ.. ఒక్క వరుడే లేడు. ముందుగానే అన్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24ఏళ్ల క్షమా బిందు తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇందుకు తొలుత గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్‌ 11న ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే, ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమా తీరును తప్పుబట్టిన కొందరు రాజకీయ నేతలు ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా నేడు వివాహం చేసుకొంది.


ఇంతకీ ఎవరీ క్షమా బిందు?


గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు.. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్‌ రిక్రూట్‌మెంట్‌ అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. తమ కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ చివరకు సరేనన్నారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియోకాల్‌ ద్వారా హాజరయ్యారు..

@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@

డాక్టర్ ఆకుమల్ల శ్రీనివాసులు గారికి ఎన్టీఆర్ సేవరత్న పురస్కారం 


సామాజిక స్పందన: తెలంగాణ రాష్ట్రం  హైదరాబాదు

 తెలంగాణ రాష్ట్రం  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కమిటీ హాల్ నందు జరిగిన సమావేశంలో చినుకు & లిటిల్ ఛామ్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ,వారు నిర్వహించినా శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా  సమాజంలో  వివిధ  రంగాల్లో  వారి వృత్తి విశిష్ట ప్రావీణ్యం కలిగి సమాజంలో  సేవ చేస్తున్న సమాజ సేవకులను గుర్తించి వారి సేవలను కొనియాడుతూ జాతీయ సేవ పురస్కారలు అందచేసారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వై యెస్ ఆర్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన డాక్టర్ .ఆకుమల్ల శ్రీనివాసులు గారికి వారు గత  30 ఇయర్స్  నుంచి సమాజంలో  చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఎన్టీఆర్ సేవరత్న  పురస్కారంను ఈ కార్యక్రమనికి  ముఖ్యఅతిథిలుగా  విచ్చేసిన గౌరవానియులు కొలకలూరి పౌండేషన్  అధ్యక్షులు  శ్రీ కె.రవి బాబు గారు ,  గౌరవానియురాలు పి.వి.పి. అంజనీకుమారి మేడం గారు సుపరడెంట్ తెలంగాణ హైకోర్టు ,, సినీ టీవీ నటి స్వప్న గారు , లిటిల్ ఛామ్స్ అకాడమీ  సేకరిట్రీ శ్రీ కె.బుచ్చేశ్వర్ గారు, చినుకు కల్చర్ సొసైటీ అధ్యక్షులు పి.ఎస్.మూర్తి గారు మరియు పలుగురు  ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆకుమల్ల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మహానుభావుడు తెలుగు  ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని దేశమంతటా చాటిచెప్పిన వ్యక్తి తెలుగు జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్  సందర్శించి  ఎన్టీఆర్ సమాధి పై   పుష్పగుచ్ఛం ఉంచి నమస్కారం చేసుకొన్న అనంతరం 

జాతీయ ఎన్ టి ఆర్ సేవరత్న పురస్కరo ప్రముఖుల చేతులమీదుగా అందుకోవడం నాకు  చాలా ఆనందదాయకంగా ఉంది నన్ను గుర్తించి ఈ అవార్డ్ కు ఎంపిక చేసిన లిటిల్ ఛామ్స్ అకాడమీ  ఆఫ్ ఇండియా , సేకరిట్రీ శ్రీ కె.బుచ్చేశ్వర్ గారికి మరియు చినుకు కల్చర్ సొసైటీ అధ్యక్షులు పి.ఎస్.మూర్తి గారికి మరియు  నా యొక్క సేవలను ఈ కార్యక్రమ నిర్వహికులకు తెలియచేసి  ఈ అవార్డ్ రావడానికి కారుకాలైన మా తమ్ముడు మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. చక్రవర్తి గారికి , హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.