వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, చంద్రబాబు సంచలన కామెంట్స్

 


  ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన

ఎలక్షన్లు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు..


అయితే వైసీపీ ఎమ్మెల్యేలు చాలాంది తమతో టచ్ లో ఉన్నారని పేర్కొ్న్నారు. వైసీపీలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వివేక హత్యకేసు అనేది దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ అని..ఫిజ్ఞన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని విమర్శించారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదని ఆరోపించారు. జగన్ పేదల ప్రతినిధి కాదని పెద్ద దోపిడీదారని విమర్శించారు..

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారని..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వత చికిత్స చేస్తారని పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాలపై సజ్జల ఒకటంటే, మంత్రి బొత్స మరొమాట అంటున్నారని విమర్శించారు. ఏప్రిల్ ఫూల్ అనే పదం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజలందర్నీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్ ఉన్నారని.. కానీ, ప్రజలంతా కలిసి ఆయనను ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 175 స్థానాల్లో వైసీపీను ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల బలంతోనే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నామని తెలిపారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన వైకాపా తిరిగి తమపైనే నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.