చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడం : సీఎం జగన్ కీలక ప్రకటన

 


ఏపీ , సామాజిక స్పందన

చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

‘చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోం. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు అండగా ఉంటాం. మట్టి నుంచి గట్టిగా ఎదిగిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలై ప్రపంచానికి ఫలాలు అందించాలి’ అని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్క విద్యార్థి ముఖాల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తొందని… మట్టి నుండి గడ్డిగా పెరిగిన ఈ మొక్కలు ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను మరింతగా మార్చాలని అనిపిస్తుందని.. జగనన్న గోరు ముద్దలోనూ మార్పులు చేశామని ప్రకటించారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.