విజయవాడ, సామాజిక స్పందన
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శలు చేశారు.
వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడు అని అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ..'చంద్రబాబు హయాంలో ఇసుకను పెద్ద మొత్తంలో దోపిడీ చేశారు. చంద్రబాబు 17 సార్లు ఇసుక పాలసీలపై జీవోలు ఇచ్చాడు. చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట వద్దే పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేశారు. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్న వనజాక్షని కొట్టింది చంద్రబాబు హయాంలోనే. వనజాక్షి, చింతమనేనిని పిలిచి చంద్రబాబు పంచాయితీ చేశాడు..
బాబు హయాంలో 60 లక్షలు దొంగ ఓట్లు..
ఇదే క్రమంలో దొంగ ఓట్లపై కూడా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు. బాబు హయాంలో 60లక్షల దొంగ ఓట్లను చేర్పించారు. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో 12వేల దొంగ ఓట్లు గుర్తించాం. కుప్పంలో ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయి. వాటి మీద కూడా అభ్యంతరం వ్యక్తం చెబుతాం. 2018లోనే 60 లక్షల ఓట్లు చేర్పించారు. దొంగ ఓట్లను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. చంద్రబాబుకు చేతనైతే గేట్లు తెరిచి చూడొచ్చు' అంటూ ఘాటు విమర్శలు చేశారు.










0 Comments