సోమవారం ఢిల్లీకి బయలుదేరిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

 

అమరావతి, సామాజిక స్పందన

 తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిదార్ధ లూథ్రా కుమారుని వివాహం ఆదివారం, రిసెప్షన్‌ సోమవారం జరగనుంది..

హోటల్‌ రీజెన్సీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఈ రిసెప్షన్‌కు హాజరు కానన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. మంగళవారం (28వ తేదీ) వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారు..

కాగా స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఈ నెల 28న (మంగళవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. స్కిల్‌ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇటీవల రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయగా, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సీఐడీ సవాల్‌ చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో హైకోర్టు తన పరిధి దాటిందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.