GSDPలో దేశంలోనే నంబర్‌వన్ ప్లేస్‌ లో ఏపీ ! తెలంగాణ ఎన్నో స్థానంలో వుందో తెలుసా ?

 


ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన:

2021-22 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 11.43శాతానికి పెరిగి టోటల్‌ ఇండియాలోనే టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది. దేశ సగటు కంటే, ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం గొప్ప విజయం సీఎం జగన్‌ హర్షం వ్యక్తంచేశారు. దీనికి, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారదర్శక విధానాలే కారణమన్నారు. స్కూల్స్‌, హాస్పిటల్స్ డెవలప్‌ కోసం చేపట్టిన నాడు-నాడు, వెల్ఫేర్‌ స్కీమ్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు జగన్‌. ఇక, ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లో 12.78శాతం వృద్ధి రేటు సాధించడం కూడా గ్రేట్‌ అఛీవ్‌మెంట్‌ అన్నారు. MSME సెక్టార్‌ కూడా ఎకానమీ గ్రోత్‌కు దోహదపడిందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.


GSDP (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత, 11.43 శాతం వృద్ధి రేటుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా, 10.48 శాతం వృద్ధి రేటుతో బీహార్ మూడో స్థానంలో ఉంది. తెలంగాణ 10.88 శాతం వృద్ధి రేటుతో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కంటే ఏపీ 11.43 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది.


############# మరిన్ని వార్తలు#############

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కొనసాగుతున్న చర్యలు, ఢిల్లీలో ఇద్దరి అరెస్ట్ 

ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన :

గత ప్రభుత్వంలో జరిగింది స్కిల్ డెవలప్‌మెంటా? లేక స్కామ్ డెవలప్‌మెంటా? అప్పుడెప్పుడో జరిగిన ఈ డీలింగ్స్‌పై ఇప్పుడెందుకు అరెస్టులు జరుగుతున్నాయి?

ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోలీసులు ఢిల్లీలో నిన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. CA విపిన్‌ కుమార్‌‌తో పాటు ఆయన భార్య నీలం శర్మను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. సెప్టెంబరు 7 వరకు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. గత టీడీపీ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 2014–15 మధ్య సీమెన్స్‌ ఇండియా కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. 3,300 కోట్ల రూపాయలతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌కు సెంటర్స్‌ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రాజెక్టుపై ప్రతిపాదన సమర్పించింది. 90 శాతం గ్రాంట్‌, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రతిపాదించింది. అయితే కనీస పరిశీలన, నిర్ధారణ లేకుండానే గత ప్రభుత్వం ఒకే చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీవీ రమేష్‌ ఆదేశాలు జారీ చేశారు. అదీకాక ప్రాజెక్టు పనులు మొదలు కాకముందే అడ్వాన్స్‌ కింద 370 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఈ కేసులోనే ఢిల్లీలో సీఏ దంపతుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో వందల కోట్ల రూపాయల స్కామ్‌ చేసిందెవరు? వాళ్ల వెనుక ఉన్నదెవరు? ఇదే ఇప్పుడు మెయిన్‌ పాయింట్‌గా మారింది. దాంతో, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అసలు సూత్రధారులెవరో? ఎవరెవరు ఎంతంత నొక్కేశారో తేల్చే పనిలో పడ్డారు అధికారులు

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.