మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి, సిఐటియు ఆధ్వర్యంలో వినతి

 


కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన:

   మున్సిపాల్టిలో చేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ కి కూడా హెల్త్ అలవెన్స్ లు ఇవ్వాలని ఎ.పి. మున్సిపల్ వర్కర్స్ & హెల్పర్స్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ కి వినతిపత్రం అందజేసారు. మున్సిపల్ వర్కర్స్ లో ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వ కక్షగట్టిందని అన్నారు. ఒక పక్క సంక్షేమ పధకాలు అమలు చేస్తామని చెబుతూనే మరో పక్క ఆగష్టు 1 నుండి ఇంజనీరింగ్ వర్కర్ల ఇళ్ళలో ఉండే వృద్దులకు పెన్షన్ ఆపేసారని అన్నారు. రాష్ట్రంలో జగన్ మెాహన్ రెడ్డిని మున్సిపల్ వర్కర్లను పర్మినెంట్ చెయ్యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్నాలంటుంటే మీరు కాంట్రాక్ట్ వర్కర్లు అంటున్నారని, కుటుంబంలో ఇచ్చే సంక్షేమ పథకాలను మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులంటూ తీసేస్తున్నారని అన్నారు. మున్యిపాల్టిలో ఒకే విభాగంలో పన చేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్లకు హెల్త్ అలవెన్స్ లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. పర్మినెంట్ చేయ్యాలని డిమాండ్ చేసారు. 11 వ తేదీన విజయవాడలో జరిగే మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల రాష్ట్ర వ్యాపిత సదస్సు జరుగుతుందని దీనిని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్, కె రమణ, బాసిన వీరభద్రరావు, ఐ స్వామి, వాకాడ భాస్కరరావు, గజ్జి సతీష్, తూతిక సాయి, బొప్పే భద్దరరావు తదితరులు పాల్గోన్నారు.


@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@


జర్నలిస్టుల సమస్యలపై గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కి వినతిపత్రం అందచేసిన ఎన్.ఎ.ఆర్.ఎ


విశాఖపట్నం, సామాజిక స్పందన :

కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రశ్నార్ధకంగా మారిన మీడియా రంగం సమస్యలు, వాటిల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారంపై నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) ప్రత్యేక శ్రద్ధపెట్టింది.

దీనిలో భాగంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ని కలిసి వినతిపత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు అందజేశారు..

రాష్ట్రంలో ఏడాది క్రితం వరకూ అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల మెడిక్లయిమ్ పాలసీని, 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్స్యూరెన్స్ పునరుద్దరించి, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆయా సదుపాయాలను కల్పించాలని,విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మీడియా మిత్రులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ధిక భద్రత, బీమా, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలని, కరోనా వచ్చి వైద్యం చేయించుకుంటున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ప్రతి జర్నలిస్ట్‌కు నెలకి 10,000 ఆర్ధిక సహాయం అందించాలని,పలు డిమాండ్లను గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కి తెలియచేసారు...


నేషనల్ యాక్టివ్ రిపోరర్టర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన డిమాండ్ల పై గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల డిమాండ్లు పూర్తి న్యాయబద్ధమైనవని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేస్తాం అని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు బి.వి.ఎన్.పాత్రో, వెంకటరమణ,గౌస్,రాజారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది క్రితం వరకూ అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల మెడిక్లయిమ్ పాలసీని, 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్స్యూరెన్స్ పునరుద్దరించి, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆయా సదుపాయాలను కల్పించాలని, మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్‌ కార్డులను కేవలం బస్ పాస్‌ల కోసమో, రైల్వే పాస్‌ల కోసమో ఇస్తున్నామన్న భావన నుంచి బయటకువచ్చి వాటి ద్వారా ఆయా ప్రతినిధులకు ఆర్ధిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందనీ ఎన్.ఎ.ఆర్.ఎ. అభిప్రాయపడింది. గతంలో ప్రకటించిన మాదిరిగా రిటైర్డ్ జర్నలిస్ట్‌లకు పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ఆర్ధిక ఆసరా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కరోనావైరస్ కష్టాలు మీడియా రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని, అయితే, ఈ మధ్య జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమ, బీమా రక్షణ వంటి కార్యక్రమాలు సక్రమంగా అమలుజరగడం లేదన్నారు.

‘‘కరోనా విపత్తు నేపథ్యంలో కూడా ప్రభుత్వం కనీసం వాటి పునరుద్దరణ, అమలుపై దృష్టిపెట్టని ఫలితం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులకు మరణశాపంగా మారింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన ఎలక్ట్రానిక్ మీడియా (సీవీఆర్ న్యూస్) వీడియో జర్నలిస్టు పార్థసారథి, తెలంగాణలో టీవీ 5 రిపోర్టర్ మనోజ్ కుమార్ ల ఉదంతాలే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధుల జీవితాలకు రక్షణ లేదన్న విషయం సారథి మరణంతో మరోమారు నిరూపితమైంది. సహజంగా ప్రతి పాత్రికేయుడు విధి నిర్వహణలో ముందుండాలని, తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని ముందుగా వార్తల రూపంలో అందించాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో అనేకమంది మిత్రులు ప్రాణాంతకమని తెలిసినా రిస్క్ ఫేస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో జర్నలిస్టు సోదరులు కరోనా వైరస్ బారిన పడటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కరోనాపై ప్రత్యక్ష పోరులో మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాలలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది.’’ అని పేర్కొన్నారు.

కరోనా వారియర్స్‌ (వైద్యులు, పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు)కు అమలుచేస్తున్న కొవిడ్-19 బీమాను వర్కింగ్ జర్నలిస్టులకు కూడా వర్తింపజేసి, కష్టాల్లో ఉన్న మీడియా రంగాన్ని ఆదుకునేందుకు ఆర్ధిక ఉద్దీపన పథకాన్ని అమలుచేయాలని, జీవితాలకు భరోసా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మీడియా మిత్రులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ధిక భద్రత, బీమా, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలని కోరుతున్నామన్నారు.

 కరోనా వారియర్స్ (వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుధ్య కార్మికుల) జాబితాలో మీడియా ప్రతినిధులను చేర్చకపోవడం వల్ల జరిగిన నష్టం ఎలా ఉంటుందో చనిపోయిన జర్నలిస్టుల దారుణాన్ని చూస్తే మరోసారి అర్ధమవుతుంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల చాలా ఇబ్బందులు పడుతున్నారు..

ప్రభుత్వం జర్నలిస్టులని ఆదుకోవాలని, అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కళ్యాణ యోజన పథకం కింద 50 లక్షల కొవిడ్-19 బీమా సౌకర్యాన్ని పోలీసులకి, డాక్టర్లకు ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై చొరవ చూపాలని, కరోనా వచ్చిన జర్నలిస్టులకు వైద్యం చేయించుకుంటున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ప్రతి జర్నలిస్ట్‌కు నెలకి 10,000 ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు బి.వి.ఎన్.పాత్రో,విశాఖపట్నం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటరమణ, జిల్లా సెక్రటరీలు గౌస్,రాజారావు,సభ్యులు అనిల్ కుమార్,నాగార్జున,రాజా,వెంకటేష్,శ్రీనివాస్ పాల్గొన్నారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.