తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలనుపరిశీలించిన టీడీపీ అధినేత
వరి ధాన్యాలను పరిశీలించిన చంద్రబాబు నాయుడు
రైతులు వరిని ఆరబెట్టిన ప్రదేశం వద్దకు వచ్చి రైతులతో మాట్లాడిన చంద్రబాబు
చంద్రబాబు ముందు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
కౌలు పొలాలు వేసుకొని పూర్తిగా నష్టపోయామని చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
• *టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాయింట్స్:-*
రాష్ట్రంలో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది.
గోదావరి జిల్లాల్లో 40 నుంచి 50 శాతం పంట ఇప్పటికీ పొలాలు, కళ్లాల్లో ఉంది.
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తాడో ఈ సిఎం చెప్పాలి...
ప్రభుత్వాలు గతంలో పంటలకు ఇన్సూరెన్స్ చేసేవాళ్లురాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్రం కలిసి ఇన్సూరెన్స్ కట్టేవారు.
ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ తీసేశారు. నాడు అసెంబ్లీలో ఇలాగే ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టాను అని చెప్పాడు.
నాడు అసెంబ్లీలో పోడియం వద్ద కూర్చుని నిరసన చేశాను. అప్పుడు రాత్రికి రాత్రి డబ్బు కట్టాడు.
ఇన్సూరెన్స్ కట్టి ఉంటే వారికి నేడు కాస్త భరోసా లభించేది.
ఒక ఎకరానికి 50 నుంచి 60 బస్తాల ధాన్యం వస్తుంది. కౌలు రైతు 30 బస్తాలు కౌలుగా చెల్లిస్తున్నాడు.
ఖరీఫ్ లోదెబ్బతిన్నారు....ఇప్పుడు అకాల వర్షాలకుమళ్లీ దెబ్బతిన్నారు.
దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతుల్లో దేశంలో ఎపి రెండో స్థానంలో ఉంది
కౌలు రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్సీ,బీసీలే,జగన్ వారిని పొట్టనపెట్టుకుంటున్నారు
జగన్ పాలనలో వరి సాగు చేసిన రైతు ఉరేసుకునే పరిస్థితి వచ్చింది
ఏప్రిల్ 1నుంచి ధాన్యం సేకరణకు గోనెసంచులు పంపాలి...కానీ పంపలేదు.
పంపిన గోనె సంచులు కూడా నాణ్యత లేదు. దీంతో తరుగుపోతుంది.
40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి...కానీ 4.75 లక్షల మెట్రిక్ టన్నులే ఇప్పటి వరకు సేకరించారు.
పంట అమ్మిన రైతు నుంచి ఎదురు వసూలు చేస్తున్నారు. వివిధ కొర్రీలు పెట్టి ఒక్కొ రైతుకు రూ. 300 నుంచి 600 కోత కోస్తున్నారు,
దెబ్బతిన్న పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో, ధాన్యం ఎప్పుడు కొంటారో ప్రభుత్వం చెప్పాలి.
నాడు ధాన్యం సేకరణలో చిన్న లోపం కూడా ఉండేది కాదు, సేకరణ విధానం సరళంగా ఉండేది.
ఇప్పుడు ధాన్యం తీసుకువెళ్లిన మిల్లు దగ్గర కనీసం ధాన్యం దించుకోవడం లేదు. వేరే మిల్లు దగ్గరకు వెళ్లడానికి లేదు.
నాడు హరికేస్ తుఫాను వస్తే...నేను సిఎంగా రాజమండ్రిలో 10 రోజులు ఉండి సాయం అందిన తరువాతనే మళ్లీ వెనక్కి వెళ్లాను.
ఈ రోజు రైతు సంక్షోభంలో పడ్డారు. మరి తాడేపల్లి కొంపనుంచి జగన్ ఎందుకు బయటకు రావడం లేదు. ఎందుకు ఇంట్లోనే కూర్చుని కులుకుతున్నాడు.
కరోనా సమయంలో కూడా హాలిడే తీసుకోకుండా కష్టపడి పనిచేసింది రైతన్న
అలాంటి రైతుకు మీరు ఉరితాడు వేస్తారా
బటన్ నొక్కుతాను అంటున్న జగన్....ఇప్పుడు బటన్ నొక్కాలి. జగన్ కు బొక్కడమే తెలుసు.
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు రైతుల దగ్గరకు రావడం లేదు. ఈ మంత్రి ఎందుకు ఉన్నాడు. వెళ్లి కాళ్లు మొక్కడానికా....
రైతులను పొట్టన పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదు. జగన్ అహంభావం వల్ల రైతు చితికిపోయాడు.
ప్రభుత్వం ఏంచేస్తుందో నిర్థిష్టంగా ప్రకటించాలి. ఫేక్ మాటలు కాదు.
పంట పొలాల్లో ఉన్నపంటకు ఏం ఇస్తావో చెప్పు ?
పట్టిన ధాన్యం అకాల వర్షాలకు దెబ్బతింది....దాన్ని ఎంతకు కొంటావో చెప్పు.
నేను గోదావరి జిల్లాకు వస్తున్నాను అంటే ప్రభుత్వంలో సెక్రటరీ స్టేట్మెంట్ ఇస్తాడా
ముఖ్యమంత్రి నోరు పడిపోయిందా....సమాధానం చెప్పడానికి తెలివి లేదా
బాబాయిని చంపిన వారిని కాపాడడంలో జగన్ బిజీగా ఉన్నాడు.
మీ జీవితాల్లో జగన్ ని క్షమిస్తే...మళ్లీ పుట్టగతులు ఉండవు.
ఈ స్థాయి కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వంటి వారు స్పందించాలి
రోమ్ తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు నేడు జగన్ తీరు ఉంది.
జవాబు దారీ తనం, బాధ్యత లేని ప్రభుత్వం దేశానికి అరిష్టం.
టేకుమూడి వెంకన్న అనే వ్యక్తి ఇక్కడ రైతుల కోసం మీటింగ్ పెడితే అతనిపై పోలీసులు దాడి చేశారు. పోలీసులూ గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని అతిక్రమించిన ఏ ఒక్క పోలీసులను వదిలేదు
పోలీసులకు ధైర్యం ఉంటే బాబాయిని చంపిన ముఖ్యమంత్రిని పట్టుకోవాలి
వెంకన్నను వెంటనే విడుదల చేయాలి. ఎందుకు పోలీసులు అతన్ని కొట్టారు. రైతుల తరుపున పోరాడకూడదా.... అని చంద్రబాబు అన్నారు.
.jpeg)









0 Comments