తెరాస అధినేత సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

 

సామాజిక స్పందన, హైదరాబాద్‌:

నగరంలోని బంజారాహిల్స్‌లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెరాస హైదరాబాద్‌ కార్యాలయం కోసం 4,935 గజాలు ఇవ్వడం అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100కే కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.




సామాజిక స్పందన: న్యూఢిల్లీ

 ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది. వివాహ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ బాధ్యత కాదని, అధికారుల పని అని సుప్రీంకోర్టు తెలిపింది.

ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారనే ఆరోపణలను వ్యతిరేకిస్తూ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన బీవీ నాగరత్న, అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపై 363, 366ఏ, 384, 384 సెక్షన్లతో పాటు పోక్సో కింద కూడా కేసు బుక్ అయింది. బాధితురాలు మైనర్ కాదని, మేజర్ అని, నిందితుడితో ఆర్యసమాజ్‌లో వివాహం కూడా అయిందని, అత్యాచారం ఆరోపణలు అవాస్తవమని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఆర్యసమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్‌ను గుర్తించబోమని, అసలైన సర్టిఫికెట్ ఎక్కడ అని ప్రశ్నించింది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.