సామాజిక స్పందన: హైదరాబాద్
దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెంచగా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగింది. కర్ణాటకలో బ్రాండ్, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిమెంట్ బస్తా ధర రూ.320-400 మధ్య; తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450కు చేరింది. ధరలు పెంచిన సంస్థలు ఇవే: అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, కేసీపీ, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, దాల్మియా భారత్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్లోనే ధరలు పెంచాలని చూసినా, కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో డీలర్లు వ్యతిరేకించారు. దీంతో కంపెనీలు అప్పుడు వెనక్కి తగ్గాయి. గత 3 రోజులుగా సిమెంట్ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపి, ఇప్పటికే ఉన్న పాత స్టాక్ విక్రయించాల్సిందిగా సూచించాయి. కొత్త ధర ప్రకారం, సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తాయని డీలర్లు తెలిపారు.
ఇండియాలో కొత్తగా 4041 కరోనా కేసులు నమోదు
సామాజిక స్పందన: ఢిల్లీ
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు. ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..
గడిచిన 24 గంటల్లో దేశంలో 4041 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,68,585 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 21,177 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 10 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,651 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2363 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,22,757 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,83,72,365 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 12,05,840 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.











0 Comments