నేటినుండి సమగ్ర ఓటరు సర్వే ప్రారంభం.


సామాజిక స్పందన

 తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి సమగ్ర ఓటర్ సర్వీస్ ప్రారంభమైంది.

● రేపటి నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు 


● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం.


● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించాలి.


🔻 సర్వేలో పరిశీలించే అంశాలు 🔻


● ఓటరు జాబితాలో డబుల్‌ ఎంట్రీలు..నకిలీ ఓట్ల గుర్తింపు


● చనిపోయిన వారి ఓట్ల తొలగింపు


● వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం


● డోర్‌నంబర్లు లేకుండా ఉన్న, ఒకే డోర్‌ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన


● సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం.


● దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కుని అక్కడ జాబితాలో ఉంచడం.


● ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్‌కు సిఫార్సు చేయడం.


● పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం.


● ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం.


🔻 సమగ్ర ఓటరు సర్వే షెడ్యూల్‌ 🔻


● ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్‌ లెవల్‌ అధికారుల సర్వే


● గుర్తింపు కార్డులు, జాబితాల్లోని తప్పుల సవరణ


● స్పష్టత లేని ఫొటోలు తొలగించి, మంచి ఫోటోల ఏర్పాటు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి పంపించడం.


● కొత్తగా ఓటు హక్కు పొందని వారుంటే వారు ఓటు హక్కు పొందవచ్చు.


● నియోజకవర్గం మారినా, ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.